దేశంలోనే తొలిసారిగా ‘కరోనా’ బాధితులను ట్రాక్ చేసేందుకు కొత్త పరికరం రూపొందిస్తున్నాం: ఏపీ మంత్రి మేకపాటి

  • ‘కరోనా’ పేషెంట్ కు ఈ పరికరాన్ని అమర్చుతాం
  • జీపీఎస్ మాడ్యూల్ ను తయారు చేస్తాం
  • ఆ పేషెంట్ ను నిరంతరం ట్రాక్ చేయొచ్చు
ఏపీలో కరోనా వైరస్ కట్టడి నిమిత్తం మరో వినూత్న ఆలోచన చేశామని పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారిగా ‘కరోనా’ బాధితులను ట్రాక్ చేసేందుకు ఓ కొత్త పరికరాన్ని రూపొందిస్తున్నామని ‘కరోనా’ పేషెంట్ కు ఈ పరికరాన్ని అమర్చడం ద్వారా ఆ పేషెంట్ ను నిరంతరం ట్రాక్ చేయొచ్చని అన్నారు.

జీపీఎస్ మాడ్యూల్ ను తయారు చేస్తామని, ఇప్పటికే కంపెనీలతో చర్చించామని అన్నారు. భవిష్యత్ లో ఈ మాడ్యూల్ అవసరం చాలా ఉంటుందని, పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. గ్రీన్ జోన్ లో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతులు ఇస్తున్నామని, రక్షణ చర్యలు చేపట్టి కార్మికులను అనుమతిస్తామని అన్నారు.

Mekapati Goutham Reddy
Minister
Andhra Pradesh
Corona Virus

More Telugu News